Thursday, 07 December 2023 10:05:15 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

కురవి అంగడి ఆదాయంపై అవినీతి ఆరోపణలు @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #Mahabubabad, #Kuravi, #LocalNews

Date : 16 July 2023 09:40 AM Views : 97

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో నిర్వహించే అంగడి (సంత) రాష్ట్రంలోనే అతి పెద్దది. దీని ఆదాయం ఒక్కరోజుకు లక్షల్లో ఉంటుందని అంచనా. కేవలం జిల్లాలోని వ్యాపారులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాల నుండి వ్యాపారులు ఈ అంగడికి వచ్చి కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతుంటారు. పశువులు, పాడి గేదెలు, కోళ్లు, ఇతర జంతువులు అమ్మాలన్నా, కొనాలన్నా ఈ అంగడికి రావాల్సిందే. సామాన్యునికి అవసరమయ్యే కూరగాయలు, నిత్యావసర సరుకులు, దుస్తుల నుండి అన్నీ ఈ అంగడిలో సరసమైన ధరలకే దొరుకుతాయని పేరు గాంచడంతో చుట్టు ప్రక్కల పల్లెల నుండి ప్రజానీకం ప్రతి సోమవారం జరిగే కురవి అంగడికి వస్తూంటారు. అలాంటి పేరు, ప్రఖ్యాతులుగాంచిన కురవి అంగడి ఆదాయం ప్రస్తుతం ప్రక్కదారి పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : "ముందు మురిసినోడు పండుగ కానడు" అన్నట్టుగా కాంగ్రెస్ తీరు @DhivitiNews.com

కురవి అంగడికి సంవత్సరానికోసారి మార్చి నెలాఖరులో టెండర్లు నిర్వహించి హక్కుదారులకు అంగడి నిర్వహణ అనుమతులు ఇస్తారు. కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో టెండర్ నిర్వహించినప్పటికీ ప్రభుత్వ బీడ్ ధర (47 లక్షలు) టెండర్ లో పాల్గొన్నవారు పలకకపోవడంతో టెండర్ ను రద్దు చేయడం జరిగిందని దీనితో కురవి గ్రామ పంచాయితీ కార్యదర్శి అయిన తనకే అంగడి నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం జరిగిందని కార్యదర్శి తెలిపారు. అయితే, ఈ టెండర్ రద్దయిన కారణాన్ని పై అధికారులకు తెలిపి మరోమారు టెండర్ నిర్వహించాల్సిన బాధ్యత గ్రామ పంచాయితీ పాలకమండలిపైనే ఉండగా, టెండర్ గడువు ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు టెండర్ నిర్వహించకుండా గ్రామ పంచాయితీ కార్యదర్శితోనే అంగడి నిర్వహిస్తుండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి ఊతమిచ్చేలా అంగడిలో జరిగే లావాదేవీలకు సంబంధించి కొని బిల్లులు ఇష్యూ చేయకుండా అంగడి నిర్వాహకులు ఆదాయాన్ని నేరుగా తమ జేబుల్లో వేసుకుంటున్నారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ బిడ్ ధర పలుకక టెండర్ రద్దు చేసినప్పటికీ అనుమతులు పొంది మరోమారు గ్రామ సభ తీర్మానంతో టెండర్ నిర్వహించాల్సిన బాధ్యత గ్రామ పంచాయితీ కార్యదర్శి, పాలకమండలిపై ఉండగా గ్రామ సభలో అంగడి టెండర్ ఎజెండా పెట్టినప్పుడు ఆ విషయాన్ని చర్చకు రానివ్వకుండా పాలకమండలి సభ్యులు గొడవలకు దిగుతూ గ్రామ సభను నిర్వహించకుండా చేస్తున్నట్టు స్వయంగా గ్రామ పంచాయితీ కార్యదర్శే తెలిపారు. అయితే, టెండర్ ఎజెండాగా జరగాల్సిన గ్రామ సభలను అడ్డుకునేందుకే వ్యూహాత్మకంగా గొడవపడేలా కార్యదర్శితో పాటు ముఖ్యులైన ముగ్గురు ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

కురవి సంత ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, దీని ఆదాయంతో కురవి మండల అభివృద్ధి ఎంతో చేయవచ్చునని, టెండర్ లేకుండా సంతను నిర్వహించడం మూలంగా సంత ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళుతోందని, అంగడి ఆదాయ అక్రమాలకు చెక్ పెట్టాలని సిపిఐ కురవి మండల కార్యదర్శి కరణం రాజన్న అభిప్రాయపడ్డారు. తక్షణమే గ్రామ సభ నిర్వహించి కురవి సంత టెండర్ ను నిర్వహించి ఆ ఆదాయంతో సంతకు కావాల్సిన కనీస వసతులు ఏర్పాటు చేసి అభివృద్ధికి పాటుపడాలని ఆయన డిమాండ్ చేశారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :