దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.
Also Read : శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com
మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 8 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన చెక్కులను, 6గురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, అలాగే, 12 మంది లబ్ధిదారులకు షాధి ముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి మేలు జరుగాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్యమంత్రి సహయ నిధి పథకంతో కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెళ్లిళ్ల భారం తగ్గిందని, ఆడపిల్లల తల్లితండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని, పనిచేసే ప్రభుత్వం వెనుక ప్రజలు ఉండి ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భారాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News