Thursday, 07 December 2023 09:40:08 PM
# సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం @DhivitiNews.com # ఆ ప్రకటన వెనుక కేసీఆర్ చాణక్యం..@DhivitiNews.com # మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురబోతుంది - మంత్రి హరీష్ రావు # ఎర్రబెల్లికి ఎదురు నిలిచిన యశస్విని..!!@DhivitiNews.com # వాటికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు - జాటోతు హుస్సేన్ నాయక్ @DhivitiNews.com # పెద్ద తండా.. పెద్దమ్మ@55..!! @DhivitiNews.com # స్పీడ్ పెంచిన శంకర్ నాయక్.. కేసముద్రం మండలంలో శంకుస్థాపనలు, ఓదార్పులు, ప్రచారాలు @DhivitiNews.com # తెలంగాణ రాకతో అన్ని రంగాల్లో అభివృద్ధి - మంత్రి హరీష్ రావు @DhivitiNews.com # గౌరవ వేతనం పెరుగుదలతో.. ఆర్పీల ఆనందం..!! @DhivitiNews.com # సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది సీఎం కెసిఆర్ - ఎమ్మెల్సీ కవిత @DhivitiNews.com # ఊహాగానాలకు చెక్.. విలీనానికి డెడ్ లైన్ @DhivitiNews.com # ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం - MLA శంకర్ నాయక్ @DhivitiNews.com # శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com # మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - సోనియా గాంధీ @DhivitiNews.com # గడీల పాలనపై 17న కాంగ్రెస్ యుద్దభేరి.. సోషల్ మీడియా పాత్ర కీలకం - రామడుగు నవీన్ @DhivitiNews.com # షర్మిల కేంద్రంగా రెండు రాష్ట్రాలలో మారనున్న రాజకీయ సమీకరణాలు - వ్యాసం: నవీన్ రామడుగు @DhivitiNews.com # చిన్నారులు.. మహిళా అధికారులతో కలెక్టర్ రాఖీ సందడి..!! @DhivitiNews.com # ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరిన వైకుంఠధామం @DhivitiNews.com - ఊడిన పైకప్పు.. ఖనన గద్దెకు బీటలు # క్రీడా మైదానాలతో ఆరోగ్యం, క్రీడల అభివృద్ధి - డిఆర్డిఎ పిడి సన్యాసయ్య @DhivitiNews.com # రాజకీయాల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించాలి - బైరి రవి కృష్ణ గౌడ్, గుండగాని వేణు @DhivitiNews.com

కేసముద్రం ఎస్.వి.వి. హై స్కూల్ కు ఎం.ఈ.ఓ నోటీసులు.. గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిక @DhivitiNews.com

#Dhiviti, #DhivitiNews, #SVVHighSchool, #Kesamudram, #Mahabubabad, #LocalNews

Date : 04 July 2023 07:39 PM Views : 536

దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఎస్.వి.వి. హై స్కూల్ (శ్రీ వివేకానంద విద్యాలయం) వారు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈ విద్యా సంవత్సరంకుగాను "శ్రీ చైతన్య టెక్నో కరికులం" హోర్డింగులు ఏర్పాటు చేసి, ప్రచార బ్రోచర్లు విడుదల చేసి అమాయకులైన విద్యార్థుల తల్లిదండ్రుల నుండి టెక్నో కరికులం ఫీజులతో అడ్మిషన్లు స్వీకరించడం జరిగింది. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆ పాఠశాల ముందు ధర్నాలు చేసి, విషయాన్ని మండల విద్యాధికారికి ఫిర్యాదు చేయగా, స్పందించిన మండల విద్యాధికారి శ్రీదేవి ఎస్.వి.వి. హై స్కూల్ యాజమాన్యానికి మొట్టికాయలు వేస్తూ మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read : ఎన్నికల సీజన్ వ్యాపారులతో కాంగ్రెస్ కు నష్టం - వ్యాసం @DhivitiNews.com

అయితే, టెక్నో కరికులం అనుమతులు లేనందున ఈ పాఠశాలలో సాధారణ విద్యాబోధనలే చేయాల్సి ఉండగా, ఇప్పటికే టెక్నో కరికులం పేరిట అధిక ఫీజులతో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు సాధారణ విద్యకు సంబంధించిన ఫీజులే వర్తింపజేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి వెలుగు శ్రవణ్ డిమాండ్ చేశారు.

ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా.. ఎంఈఓ నోటీసులు ఇచ్చిన తరువాత టెక్నో కరికులం పేరిట అడ్మిషన్లు తీసుకోవడం లేదని, ప్రచార హోర్డింగులు సైతం తొలగించామని తెలిపారు. కానీ ఇప్పటికే టెక్నో కరికులం పేరిట స్వీకరించిన అడ్మిషన్లకు సాధారణ ఫీజును వర్తింపజేస్తారా? అని అడిగిన ప్రశ్నకు దాటవేత సమాధానం చెప్పారు. ఈ విషయమై విద్యాధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

Admin

Admin

Dhiviti News

మరిన్ని వార్తలు

Copyright © Dhiviti News 2023. All right Reserved.

Developed By :